అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Mar 13 2025 11:15 AM | Updated on Mar 13 2025 11:15 AM

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

దేవరకొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని దేవరకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ జాఫర్‌ అలియాస్‌ అహ్మద్‌, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మోసీన్‌ అపార్ట్‌మెంట్‌లను టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారు. వీరిద్దరు ఎంత దూరమైనా స్కూటీపై ప్రయాణం చేస్తూ చోరీలు చేస్తుంటారు. దేవరకొండ పట్టణంలోని మీనాక్షి ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శీలా వాసు గత నెల 19న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అప్పటికే దేవరకొండ పట్టణానికి వచ్చిన షేక్‌ అబ్దుల్‌ జాఫర్‌, మహ్మద్‌ మోసీన్‌ కలిసి వాసు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని గమనించి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాలతో కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న దేవరకొండ పోలీసులు ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 11న షేక్‌ అబ్దుల్‌ జాఫర్‌, మహ్మద్‌ మోసీన్‌ మళ్లీ దేవరకొండకు బస్సులో వచ్చారు. వారు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరు ఏపీలోని విశాఖపట్నం, కర్నూల్‌ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు దొంగిలించిన బంగారాన్ని పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఫసికి అప్పగిస్తారని.. ఆ బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును పంచుకుంటారని ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. జాఫర్‌పై 70 కేసులున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ సీఐ నర్సింహులు, ఎస్‌లు అజ్మీరా రమేష్‌, నారాయణరెడ్డి, కోటేష్‌, కానిస్టేబుళ్లు హేమునాయక్‌, తిరుపతి, చాంద్‌పాషా, సతీష్‌, అంజి, ఇమ్రాన్‌, సోమ్లా, సింహాద్రిని ఏఎస్పీ అభినందించారు.

ఫ 20 తులాల బంగారం స్వాధీనం

ఫ వివరాలు వెల్లడించిన

దేవరకొండ ఏఎస్పీ మౌనిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement