
కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలువురు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
కలకోవ వాసికి 29వ ర్యాంకు
మునగాల: గ్రూప్–2 ఫలితాల్లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన గుండు లక్ష్మణ్వర్మ రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించారు. గతంలో చైన్నెలో ఆదాయ పన్ను శాఖలో పనిచేసిన ఆయన.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు సాధించి కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–2 ఫలితాల్లో 29వ ర్యాంకు సాధించాడు.
ఇటుకులపహాడ్ వాసికి 60వ ర్యాంకు
శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన రచ్చ శ్రీనివాస్–తిరుమలేశ్వరి దంపతుల కుమారుడు రచ్చ పవన్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించాడు. గతంలో టీసీఎస్ కంపెనీలో రూ.3.40లక్షల వార్షిక ప్యాకేజీతో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసిన అతడు గత డిసెంబర్లో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కు ప్రిపేరైన పవన్కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 434 మార్కులు సాధించగా.. గ్రూప్–2లో 60వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఆన్లైన్, యూట్యూబ్లో క్లాస్లు విని ప్రిపేరయ్యాని, సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని పవన్కుమార్ పేర్కొన్నారు.
80వ ర్యాంకు సాధించిన డిండి మండల వాసి..
డిండి: డిండి మండలం రుద్రాయగుడెం గ్రామానికి చెందిన పోనుగోటి వినయ్రావు గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 80వ ర్యాంకు సాధించారు. వినోద్రావుకు ప్రభుత్వ ఉధ్యోగం రావడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
135వ ర్యాంక్ సాధించిన రాజశేఖర్రెడ్డి
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 135వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్ద తమ్ముడు గోవిందరెడ్డి 2020లో అంబర్పేట్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా, చిన్న తమ్ముడు విజయ్భాస్కర్రెడ్డి హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
కీతవారిగూడెం వాసికి 301వ ర్యాంకు..
గరిడేపల్లి: గ్రూప్–2ఫలితాల్లో గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన గుండు అనిల్కుమార్ రాష్ట్రస్థాయిలో 301వ ర్యాంకు సాధించాడు. అనిల్కుమార్ ప్రస్తుతం పులిచింతల పవర్హౌజ్లో జేఏఓగా పనిచేస్తున్నాడు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శనం, స్నేహితుల సహాయమే కారణమని ఆయన పేర్కొన్నారు.
బురుగులతండా వాసికి 512వ ర్యాంకు..
నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం బురుగులతండాకు చెందిన మాలోతు తేజ మంగళవారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జనరల్ కేటగిరీలో 512 ర్యాంకు.. ఎస్టీ కేటగిరీలో 20వ ర్యాంకు సాధించాడు. మారుమూల గిరిజన తండాకు చెందిన తేజ గతంలో రైల్వే శాఖలో రెండు ఉద్యోగాలు సాధించాడు. అనంతరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ప్రస్తుతం కేరళలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2కు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సాధించాడు.
గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక
గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పట్టుదలతో చదివి గ్రూప్–1 ఫలితాల్లో 600 మార్కులకు గాను 475 మార్కులు సాధించాడు. తన ర్యాంకును బట్టి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందన్న ఆశాభావాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన పాఠశాల స్ధాయిలో గురువులు నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్ధాయికి ఎదిగానని చెప్పారు.

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు

కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు