10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌ సెమీస్‌ | - | Sakshi
Sakshi News home page

10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌ సెమీస్‌

Sep 9 2025 6:44 AM | Updated on Sep 9 2025 6:44 AM

10న క్వాంటం వ్యాలీ  హ్యాకథాన్‌ సెమీస్‌

10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌ సెమీస్‌

10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌ సెమీస్‌

భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌ సెమీఫైనల్స్‌ ఈ నెల 10న జరుగుతాయని కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్‌ కేవీ మురళీకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్‌ హెడ్‌ ఎన్‌.గోపాలకృష్ణమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి 40 బృందాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు కళాశాల ఓపెన్‌ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్‌ చాన్స్‌లర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ హాజరవుతారని న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యా మండలి మాజీ వైస్‌ చైర్మన్‌, ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్‌ఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్‌ వి.వల్లికుమారి వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement