
చిచ్చుపెడతారా ?
ప్రశాంత వాతావరణంలో టీడీపీ శ్రేణులు చిచ్చు పెడతారా? కామిరెడ్డి నానిపై దాడి దుర్మార్గం. దాడులు, అక్రమ కేసులు పెట్టి ఏం చేయాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. గత ఐదేళ్లలో శిలాఫలకాలు, హోర్డింగులు మేం ధ్వంసం చేశామా? పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్
ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి, సంక్షేమం చేసి సమస్యలు పరిష్కరించాలని కానీ దాడులు, కొట్లాటలు చేయడానికి కాదు. ఇలాంటి చర్యలు సరికాదు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలి. బాధితులపై చర్యలు తీసుకోవాలి.
– కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే

చిచ్చుపెడతారా ?