
బలవంతపు సమీకరణ
ధాన్యం రైతుల గగ్గోలు
శురకవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ
ఉమ్మడి జిల్లా నుంచి 220 ఆర్టీసీ బస్సులను గురువారం సాయంత్రం 5 గంటలకే అమరావతి సభ పేరుతో తరలించారు. ఇక జిల్లా రవాణా శాఖ ద్వారా ప్రైవేట్, స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులు కూడా పూర్తిగా రప్పించి గ్రామాలవారీగా రూట్లు నిర్ణయించి పంపారు. దీంతో గురువారం సాయంత్రం నుంచే ఏలూరులో ఆర్టీసీ బస్టాండ్ తీవ్ర ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఒక్క బస్సు కూడా లేకుండా బస్టాండ్ ఖాళీగా ఉండటంతో కొంత గందరగోళం రేగింది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లో 90 శాతం మందికిపైగా ఉద్యోగులకు ప్రధాని సభకు సంబంధించిన విధులు కేటాయించారు. అలాగే 80 శాతం మంది పోలీసులను బుధవారం నుంచే బందోబస్తుకు కేటాయించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి పనులు కావాలంటే అమరావతి రావాల్సిందే.. డ్వాక్రా గ్రూపులు సజావుగా సాగాలంటే ప్రధాని సభకు వచ్చి తీరాల్సిందే.. రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రావాలి.. ఇలా గ్రామానికి 200 మందిని తీసుకువెళ్లాలని టార్గెట్ పెట్టారు.. మీరెవ్వరూ రాకపోతే మీ ఎమ్మెల్యేలు కోప్పడతారు.. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి.. అంటూ ఊళ్లల్లో హెచ్చరికలు చేసి మరీ జన సమీకరణకు సర్కారు నానా తంటాలు పడుతోంది. శుక్రవారం అమరావతిలో జరిగే ప్రధాన మోదీ బహిరంగ సభకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించడంతో గ్రామస్థాయి కార్యదర్శి మొదలు కలెక్టర్ వరకూ అందరూ సమీకరణ హడావుడిలో నిమగ్నమయ్యారు. మండుటెండలో అంత దూరం వచ్చి ఇబ్బందులు పడలేమంటూ ప్రజలు తిరస్కరించినా వచ్చి తీరాల్సిందేనని హుకుం జారీ చేసి మరీ తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు 220, ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు 500 ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా 600 కార్లను తరలింపునకు సిద్ధం చేశారు.
కలెక్టర్ల పర్యవేక్షణలో..
అమరావతిలో శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో భారీ జనసమీకరణతో హడావుడి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి పొరుగు జిల్లా కావడంతో ఉమ్మడి పశ్చిమ నుంచి భారీగా జనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం, నియోజకవర్గాల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. అధికారిక కార్యక్రమం కావడంతో పూర్తి బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. జనసమీకరణ మొ దలు వాహనాల ఏర్పాట్ల వరకు అన్ని పనులను కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
బస్సుకో ఇన్చార్జి
జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, రైతులు, వివిధ రకాల చేతివృత్తులు చేసుకుంటున్న వారిని ప్రధానంగా గ్రామాల వారీగా ఎంపిక చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 30 వేలకు మందికి తగ్గకుండా వీరినే తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీఓలు ప్రతి గ్రామంలో 45 మందిని తరలించడానికి వీలుగా ప్రతి బస్సుకు ఇన్చార్జిని ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, దెందులూరు, చింతలపూడి నుంచి మండలానికి 20 నుంచి 25 బస్సులు, దూరం ఉన్న నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 బస్సులు ఏర్పాటు చేసి ఉదయం 8 గంటకల్లా అందరినీ సమీకరించుకుని బయలుదేరి గన్నవరంలోని సిద్థార్ధ మెడికల్ కళాశాల వద్ద 11 గంటలకు భోజనాలు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సభలో కూర్చొపెట్టి ప్రతిచోటా ఫొటోలు తీసి కలెక్టర్ పేషీకి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మనిషికి రూ.90లు బడ్జెట్ కేటాయించి దానిలో రెండు అరటిపండ్లు (రూ.12), రెండు వాటర్ బాటిళ్లు (రూ.18), ఉదయం పెట్టే పులిహోర ప్యాకెట్ (రూ.60) చొప్పున ఖర్చు పెట్టాలని అధికారులు ఆదేశించారు.
బస్టాండ్లో
బిడ్డతో ఓ తల్లి
అవస్థలు
ధాన్యం కొనడం లేదంటూ
రైతుల ధర్నా
● ధాన్యం కొనడం లేదని ఆందోళన ● రైతు సేవా కేంద్రాల వద్ద నిరసనలు
న్యూస్రీల్
బస్సులు లేక.. ప్రయాణాలు సాగక..
ప్రధాని సభకు భారీగా జన సమీకరణ
కూలీలు, మహిళలు, రైతులే లక్ష్యం
రాకుంటే తీవ్ర పరిణామాలంటూ అధికారుల హెచ్చరికలు
ఉమ్మడి జిల్లా నుంచి 720కి పైగా బస్సుల ఏర్పాటు
గురువారం సాయంత్రం నుంచే బస్టాండ్లు ఖాళీ
బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

బలవంతపు సమీకరణ

బలవంతపు సమీకరణ

బలవంతపు సమీకరణ

బలవంతపు సమీకరణ

బలవంతపు సమీకరణ