
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ప్రాంగణంలో యోగ అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా సంజీవని అని అన్నారు. మహిళలు తమ జీవిత భాగస్వామికి కూడా యోగాపై అవగాహన కల్పించి యోగా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా లేబర్ ఆఫీసర్ ఎ.లక్ష్మీ, సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు సుబ్బరాజు, కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు.