
కూటమి దగాపై వైఎస్సార్సీపీ పోరుబాట
4న ‘వెన్నుపోటు దినం’ నిరసనకు పిలుపు
సాక్షి, భీమవరం: కూటమి వంచన పాలనకు నిరసనగా ఈనెల 4న వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణు లు, ప్రజలు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఏపీ స్టేట్ బీసీ సెల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి తదితరులు హాజరయ్యారు. వెన్నపోటు దినం కార్యక్రమం విజయవంతానికి సమావేశంలో చర్చించారు. కూటమి వంచనపై ప్రజల గొంతుకగా వారి పక్షాన ఉద్యమించాలని నిర్ణయించారు.
ప్రజలను నట్టేట ముంచారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు, అన్యాయాలకు నిరసనగా ఈనెల 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించిందన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని శాంతియుత ర్యాలీగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేయాలని ప్రసాదరాజు కోరారు.
సంక్షేమాన్ని గాలికొదిలేసి..
పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి కేసులు, కక్ష సాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్తో ఏడాది కాలం గడిపేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ కవురు, మహిళా నేత ఉమాబాల, గోపి తదితరులు మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు మరోపేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అదే ఆయన మార్క్ అ ని ఎద్దేవా చేశారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కో–ఆర్డినేటర్ బందన పూర్ణచంద్రరావు, పార్టీ నేతలు గుణ్ణం నాగబాబు, ఎడ్ల తాతాజీ, కోడే విజయలక్ష్మి, పాల రాంబాబు, పప్పుల రామారావు, కల్వపూడి ప్రసాద్రాజు, ము ప్పిడి సంపత్ రావు, చినమిల్లి వెంకటరాయుడు, పే రిచర్ల విజయ నరసింహారాజు, గాదిరాజు రా మరాజు తదితరులు హాజరయ్యారు.