అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Apr 22 2025 1:01 AM | Updated on Apr 22 2025 1:01 AM

అర్జీ

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

కలెక్టర్‌ నాగరాణి

భీమవరం (ప్రకాశం చౌక్‌): ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. భూమి, ఇళ్లు, సరిహద్దులు, పెన్షన్లు, రేషన్‌కార్డులు, పోలీసు కేసులు, రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు తదితర సమస్యలపై 237 అర్జీలు వచ్చాయి. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, వృద్ధుల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

కుమారుడికి పెన్షన్‌ కోసం..

అత్తిలి మండలం అరవల్లి గ్రామానికి చెందిన మల్లిడి సురేఖ దంపతుల కుమారుడు ఆరేళ్ల వయసు నుంచి మానసిక, శారీరక దివ్యాంగుడిగా ఉన్నాడు. అకస్మాత్తుగా పడిపోతూ ఉండటంతో తల్లితండ్రులు అనుక్షణం అందుబాటులో ఉండాల్సి ఉంటోంది. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వైద్యం కోసం తీసుకువెళ్లడం, ప్రతినెలా మందులు, ఇతర ఖర్చులకు రూ.15 వేల వరకు ఖర్చవుతున్నాయి. దీంతో కూలీ పనులపై బతికే సురేఖ దంపతులకు కుమారుడి వైద్య ఖర్చులు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తమ కుమారుడికి రూ.15 వేలు పెన్షన్‌, ట్రైసైకిల్‌ మంజూరు చేయాలని సురేఖ దంపతులు కలెక్టర్‌ను కలిసి కోరారు.

శ్మశాన వాటిక అభివృద్ధి కోసం..

ఉండిలోని పడవలవానిపేట శశ్మాన వాటికలో చెత్తాచెదారం పారవేసి డంపింగ్‌ యార్డ్‌గా మారుస్తారని, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు పీజీఆర్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే శ్మశానవాటిక పల్లంగా ఉండటంతో వర్షం నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

మంచినీళ్లు లేక ఇబ్బందులు

పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని న్యూ హౌసింగ్‌ కాలనీలో 40 కుటుంబాల వరకు ఉన్నాయని, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ ప్రాంత మహిళలు కలెక్టర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మంచినీటి పైపులైన్‌ వేయలేదని, దీంతో రెండు కిలోమీటర్లు దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కరించాలంటూ అర్జీ అందించారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 1
1/3

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 2
2/3

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 3
3/3

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement