చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి
● వీసీలో మంత్రి వాకిటి శ్రీహరి
న్యూశాయంపేట: చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మత్స్యశాఖపై కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేపపిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వీసీలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్ఖాన్, అధికారులు పాల్గొన్నారు.


