వరద బాధితులను ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులను ఆదుకుంటాం

Nov 3 2025 6:52 AM | Updated on Nov 3 2025 6:52 AM

వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

హసన్‌పర్తి: మోంథా తుపాను బాధితులను ఆదుకుంటామని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌, బైరాన్‌పల్లిలో ఆదివారం కలెక్టర్‌ పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కలెక్టర్‌ పరిశీలించారు. వరదలతో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయిన పంట వివరాల నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతుల సర్వే నంబర్లతోపాటు క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం వంగపహాడ్‌–బైరాన్‌పల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement