అసైన్డ్‌ ల్యాండ్‌ స్వాఽధీనం | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ ల్యాండ్‌ స్వాఽధీనం

Oct 19 2025 6:57 AM | Updated on Oct 19 2025 6:57 AM

అసైన్డ్‌ ల్యాండ్‌ స్వాఽధీనం

అసైన్డ్‌ ల్యాండ్‌ స్వాఽధీనం

అసైన్డ్‌ ల్యాండ్‌ స్వాఽధీనం

దామెరలో 17.09,

ముస్త్యాలపల్లిలో 4.06 ఎకరాలు

దామెర: భూమిలేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేందుకు అసైన్డ్‌ చట్టం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం భూమిని కేటాయించారు. కాగా, అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ సదరు రైతులు ఇతరులకు అమ్మారు. దీంతో అధికారులు తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దామెర మండలకేంద్రంలోని సర్వేనంబర్‌ 362లోని 17. 09 ఎకరాలు, ముస్త్యాలపల్లిలోని సర్వేనంబర్‌ 224, 255లోని 4.06 ఎకరాలు మొత్తం 21.15 ఎకరాల అసైన్డ్‌ భూమిని కొంతమంది పట్టాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసి పట్టాలు చేయించుకున్నట్లు రుజువు కావడంతో ఆ పట్టాలు రద్దుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉత్తర్వులను అధికారులు దామెర, ముస్త్యాలపల్లి జీపీల్లో శనివారం ప్రదర్శించారు. ఈ విషయమై తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవిని వివరణ కోరగా అసైన్డ్‌ చట్టాన్ని అతిక్రమించి పట్టాలు చేయించుకున్న వారి పట్టాలు రద్దుచేసినట్లు తెలిపారు. కాగా, కోట్ల రూపాయలు విలువచేసే భూమిని రక్షించిన రెవెన్యూ అధికారులను పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement