హెచ్‌ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి

Jul 18 2025 4:46 AM | Updated on Jul 18 2025 4:46 AM

హెచ్‌

హెచ్‌ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి

ఎంజీఎం: హెచ్‌ఐవీ ఇన్ఫ్‌క్షన్‌ తగ్గడానికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ సిబ్బందితో పాటు అంగన్‌వాడీ టీచర్లు ముందుండాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు అధ్యక్షతన నిర్వహించిన శిక్షణలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ మేనేజర్‌ స్వప్నమాధురి, జిల్లా ఐసీటీసీ సూపర్‌వైజర్‌ రామకృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉచిత శిక్షణ కం ఎంప్లాయ్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నెలరోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, జైనులు, పార్సీ, బౌద్ధులు) మైనారిటీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు హనుమకొండ సుబేదారి షరిఫన్‌ మజీద్‌ దగ్గరలోని అపోలో ఫార్మసీ పక్కన రెండో అంతస్తులోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయం, 040–23236112 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

జిల్లా ఇన్‌చార్జ్‌

రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్‌

కాజీపేట అర్బన్‌ : రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌శాఖ వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్‌, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

నేడు ఢిల్లీకి కమిషనర్‌

వరంగల్‌ అర్బన్‌: దేశ రాజధాని ఢిల్లీలో నేడు (శుక్రవారం) జరగనున్న స్వచ్ఛ భరత్‌ మిషన్‌ సమావేశానికి గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హాజరుకానున్నారు. కేంద్ర అర్బన్‌, గృహ నిర్మాణ మంత్రి, ఇతరులు పాల్గొనే ఈ సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షన్‌ విధానాలను వెల్లడించనున్నారు.

భాస్కర్‌రావుకు

బెస్ట్‌ టీచర్‌ అవార్డు

రామన్నపేట: నగరానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు భాస్కర్‌రావు నేషనల్‌ సుశ్రుత అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన శల్యకాన్‌–25 జాతీయ సమావేశంలో కేంద్ర ఆయుష్‌ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ చేతుల మీదుగా బెస్ట్‌ టీచర్‌ అవార్డు అందుకున్నారు. 35 ఏళ్లు వైద్యవృత్తిలో కొనసాగుతూ.. 15 వేలకు పైగా.. అర్షమొలలు, ిఫి ష్టులా చికిత్సలు చేశారు. మరోవైపు సెమినార్లలో పాల్గొనడం, పరిశోధనా పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్‌ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆయుర్వేద్విద్యా పీటీ గురువుగా పనిచేస్తున్నారు.

గుర్తింపులేని

పాఠశాలల్లో చేర్పించొద్దు..

విద్యారణ్యపురి: అనుమతి, గుర్తింపులేని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని వరంగల్‌ డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్‌ ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే ముందు ఈ విద్యాసంవత్సరానికి అనుమతి ఉందా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలను మధ్యలోనే మూసివేసే పరిస్థితులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు మాత్రమే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా విద్యార్థులకు పెన్‌ (పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌) కేటాయిస్తారని తెలిపారు. అనుమతి లేని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థికి పెన్‌ కేటాయించరని చెప్పారు.

హెచ్‌ఐవీపై విస్తృత  అవగాహన కల్పించాలి1
1/1

హెచ్‌ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement