మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

Jul 15 2025 6:11 AM | Updated on Jul 15 2025 7:09 AM

8లోu

అతడికి 42.. ఆమెకు 22

అతడికి వివాహమైంది. ఆమె విద్యార్థిని

కలిసుండలేమని ఇరువురు ఆత్మహత్య

పర్వతగిరి: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్‌–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ వి షయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్‌ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్‌ ఫోన్‌ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

నగరంలో ఓ వైద్యురాలి అనుమానాస్పద మృతి

మరో ఘటనలో వ్యక్తి,

విద్యార్థిని బలవన్మరణం

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో

కలకలం రేపిన ఘటనలు

దోషులను శిక్షించాలని

బాధిత కుటుంబీకుల డిమాండ్‌

హసన్‌పర్తి: ఓ డాక్టర్‌ కుటుంబంలో రీల్స్‌ గర్ల్‌ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వేదికగా రీల్స్‌ చేసే ఆ యువతి పట్ల డాక్టర్‌ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్‌ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్‌ భార్య, డెంటల్‌ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్‌ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అత్తామామలకు చెప్పినప్పటికీ..

డాక్టర్‌ సృజన్‌, రీల్స్‌ గర్ల్‌ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్‌ సృజన్‌ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్‌కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్‌ ఫోన్‌ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్‌ సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి :

ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్‌

ఎంజీఎం : డాక్టర్‌ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్‌ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్‌, రీల్స్‌ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్‌ సృజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.

న్యూస్‌రీల్‌

పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర సీ్త్ర, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్‌.. రీల్స్‌ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. ఓ లారీడ్రైవర్‌.. 22 ఏళ్ల కాలేజీ యువతితో ప్రేమలో పడి ఇద్దరం కలిసి ఉండలేమనుకుని పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ చనిపోయారు.

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20251
1/5

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20252
2/5

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20253
3/5

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20254
4/5

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20255
5/5

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement