
ఘనంగా తొలి ఏకాదశి పండుగ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో తొలి పండుగ తొలి ఏకాదశి ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి రుద్రాభి షేకం, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు స్వా మివారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి తొలిఏకాదశి పండుగను, చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాకతీయుల దేవా లయాల పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు.
వేయిస్తంభాల ఆలయంలో
చాతుర్మాస వ్రతం ప్రారంభం