
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే
మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్
వరంగల్ చౌరస్తా : వ్యాపారులు, పండ్లు, కూరగాయల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం నూతన కార్యవర్గం సభ్యులు.. జేడీకి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోతు రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ పాల్గొన్నారు.