
జిలెటిన్స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం
పర్వతగిరి: వ్యవసాయ భూమిలోని బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కొంకపాక గ్రామ శివారు గోపనపల్లి గ్రామానికి చెందిన ఓరైతు తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నాడని సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులు తనిఖీలు చేసి 90 జిలెటిన్స్టిక్స్, 39 డిటోనేటర్లతోపాటు కంప్రెషర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ యజమాని పవన్కల్యాణ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిలెటిన్స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం