వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jun 11 2025 7:41 AM | Updated on Jun 11 2025 7:41 AM

వరంగల

వరంగల్‌

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

క్రీడా పాఠశాల పిలుస్తోంది..

రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. తేదీల వారీగా

ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.

8లోu

నర్సంపేట: వానాకాలం పంటలకు కేంద్రం ఇటీవల మద్దతు ధరలు పెంచింది. దీంతో రైతులకు కాస్త ఊరట కలుగనుంది. జిల్లాలో అధికంగా పండే వరి కి మాత్రం పెంచింది చాలా తక్కువ అని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. అయితే, మొక్కజొన్న, పత్తి రైతులకు మాత్రం కొంతమేర ఊరట కలిగించే అంశం. పెరిగిన ధరలు వానాకాలం నుంచే అమల్లో కి రానున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

పొలం పనుల్లో రైతుల బిజీబిజీ..

జిల్లా వ్యాప్తంగా 3,08,500 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా వరి పంట కాగా.. ఆ తర్వాత పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. ఈ మేరకు రైతులు ఇప్పటికే పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. పలుచోట్ల పత్తి విత్తనాలు వేయగా.. వరి నారు పోసి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

1,45,000 ఎకరాల్లో వరిసాగు..

జిల్లాలో 1,45,000 ఎకరాల్లో అధికంగా వరి సాగవుతుంది. వరికి కేంద్రం పెంచిన మద్దతు ధర ఏ మాత్రం అన్నదాతలకు రుచించడం లేదు. సాగుకు పెరిగిన పెట్టుబడులను చూస్తే మద్దతు ధర ఏ మూలకు సరిపోదని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం రూ.69 పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరింత మద్దతు ధర ఇస్తే బాగుండని రైతులు అభిప్రాయపడుతున్నారు.

పత్తి, మొక్కజొన్నకు కాస్త మెరుగు..

జిల్లాలో వరి పంట తర్వాత పత్తి, మిరప, మొక్కజొన్న అధికంగా సాగు అవుతుంది. ముఖ్యంగా పత్తిని ఏళ్లుగా సంప్రదాయ పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ఈ పంట సాగు చేసిన రైతులు కనీస లాభాలు పొందుతున్నారు. కాగా, ఈ సంవత్సరం కేంద్రం మద్దతు ధర రూ.589 పెంచింది. దీంతో పత్తి రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, పత్తి పంట తొలగించిన తర్వాత అధికంగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. ఈ పంటకు మద్దతు ధర రూ.175 పెంచింది.

పెరిగిన ఖర్చులు..

ప్రతీ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పొలం చదును చేయడం మొదలు ట్రాక్టర్‌ దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, పైపాటు మందులు, కూలీల ఖర్చుల వంటివి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎకరా వరి సాగు చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. పండిన పంట మార్కెట్లో అమ్మితే ఖర్చులు పోను చేసిన పని మాత్రమే మిగులుతుంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర రూ.69 పెంచడం రైతులకు రుచించడం లేదు.

మద్దతు ధరలు పెంచడం హర్షణీయం

రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచడం హర్షణీయం. పత్తి, జొన్న పంటలకు కొంచెం లభించినప్పటికీ వరి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభించలేదు. ఎకరం వరిపంట సాగు చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. పండిన పంట మార్కెట్‌లో అమ్మితే కనీసం పెట్టుబడి కూడా రాదు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర రూ.69 పెంచడం సరైంది కాదు. కనీసం రూ.450కిపైగా మద్దతు ధర పెంచాలి.

– నాగంపెల్లి కిరణ్‌కుమార్‌, నందిగామ

న్యూస్‌రీల్‌

14 రకాల పంటలకు ధరలు పెంచిన కేంద్రం

పత్తి, మొక్కజొన్న రైతులకు కాస్త ఊరట

వరికి 69 రూపాయలు మాత్రమే పెంపు

జిల్లాలో 3,08,500

ఎకరాల్లో పంటల సాగు

పంటల వారీగా పెరిగిన మద్దతు ధరల వివరాలు (రూపాయల్లో)

పంట పెరిగిన

మద్దతు ధర

వరి 69

పత్తి 589

ఆవాలు 820

రాగులు 596

నువ్వులు 579

వేరుశనగ 480

కంది 450

పొద్దు తిరుగుడు 441

మినుములు 400

సోయాబీన్‌ 436

జొన్న 328

మొక్కజొన్న 175

సజ్జలు 150

పెసర 86

జిల్లాలో వివిధ పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)

పంట 2024 2025

సంవత్సరం సంవత్సరం

వరి 1,30,720 1,43,803

మొక్కజొన్న 763 9,820

పత్తి 1,20,166 1,26,173

కంది 1,074 1,180

మిర్చి 4,770 9,000

పసుపు 841 950

ఇతర పంటలు 15,818 17,400

వరంగల్‌1
1/3

వరంగల్‌

వరంగల్‌2
2/3

వరంగల్‌

వరంగల్‌3
3/3

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement