
రెవెన్యూ సదస్సును సమర్ధవంతంగా నిర్వహించాలి
నర్సంపేట రూరల్: భూభారతి రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును బుధవారం సందర్శించి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టాదారు పాసు పుస్తకాల్లో వివరాల నమోదు, ఇతర ఎలాంటి సమస్యలున్నా రైతులు భూభారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులపై సమర్ధవంతంగా విచారణ చేపట్టి అర్హులందరికీ పరిష్కారం లభించేలా కృషి చేయస్తామన్నారు. భూ భారతి చట్టాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పలువురు
తహసీల్దార్ల బదిలీ
న్యూశాయంపేట: జిల్లాలో పనిచేస్తున్న పలువు రు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యశారద బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎన్.రమేష్ను ఖానాపురం తహసీల్దార్గా, చెన్నారావుపేటలో తహసీల్దార్గా పనిచేస్తున్న పీఎస్.ఫణీకుమార్ను ఆర్డీఓ వరంగల్, డీఏఓగా, వరంగల్ ఆర్డీఓ ఆఫీస్లో డీఏఓగా పనిచేస్తున్న దిలావర్ మహ్మద్ ఆబిద్అలీని చెన్నారావుపేట తహసీల్దార్గా, నర్సంపేట డిప్యూటీ తహసీల్దార్ (ఎన్నికల విభాగం)లో పనిచేస్తున్న ఏ.రాజేశ్వర్రావును దుగ్గొండి తహసీల్దార్(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భారం మేం
మోయలేం..!
● జీపీల ట్రాక్టర్ల తాళాలను
ఎంపీడీఓకు అప్పగించిన పీఎస్లు
గీసుకొండ: మండలంలోని 21 గ్రామపంచా యతీల ట్రాక్టర్ల తాళాలను పంచాయతీ కార్యదర్శు(పీఎస్)లు బుధవారం ఎంపీడీఓ కృష్ణవేణికి అప్పగించారు. గ్రామాల్లో సర్పంచ్ల పద వీ కాలం ముగిసిన 18 నెలల నుంచి ప్రత్యేక అధికారులు పాలన సాగుతోంది. ఈ కాలంలో పంచాయతీల్లో తాగు నీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, మొక్కలకు నీరుపట్టడం, తదితర నిర్వహణ ఖర్చుల విషయంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి సు మారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు స్వంత డబ్బులు ఖర్చు చేశామని తెలిపారు. బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే చెక్కులు పాస్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇలాంటి పరిస్థితిలో తాము ట్రాక్టర్ల డీజిల్, రిపేరింగ్ ఖర్చులు భరించలేమంటూ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు మూకుమ్మడిగా పంచాయతీ కార్యదర్శులు కలిసి వెళ్లి తాళం చెవిలను ఎంపీడీఓకు అప్పగించారు. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తప్పేలా లేదు.
పరీక్షల పర్యవేక్షణాధికారిగా శ్రీదేవి
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. శ్రీదేవి పరీక్షల పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీ, పీజీ పరీక్షలతోపాటు ఇతర పోటీల పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను శ్రీదేవి నిర్వహిస్తారని తెలిపారు.
డ్రెయినేజీ బ్లాకేజ్ ప్రాంతాల్లో
మెష్లు ఏర్పాటు చేయండి
వరంగల్ అర్బన్: నగర డ్రెయినేజీల్లోని నీటి బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డివిజన్లలోని డ్రెయిన్లలో బ్లాకేజ్ ఏరియాలను గుర్తించి మెష్లు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 66 డివిజన్లకు ఎన్ని మెష్లు అవసరమో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్ కుమార్ పాల్గొన్నారు.