
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్ధన్నపేట: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద సబ్ సెంటర్–2 వైద్య శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్, రికార్డులను పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఇంటి చుట్టూ మురికి కాల్వల్లో నీటి నిల్వ ఉండడం వల్ల దోమల ఉధృతి అధికం అవుతుందని వివరించారు. నీటి నిల్వ ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. వర్షాకాలంలో బోర్లలో నీరు మారుతుందని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైద్య శిబిరం ప్రక్రియను సందర్శించి పలు సలహాలు, సూచనలు చేశారు. డాక్టర్ సురేష్ కుమార్, కార్యదర్శి రామారావు, ఏఎన్ఎం సరోజ, అపరంజి, కోమల, శోభ పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
రాయపర్తి: ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సాంబశివరావు హెచ్చరించారు. బుధవారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలైన ఇల్లంద, దమ్మన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, రాయపర్తి పరిధిలోని కేంద్రాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది ప్రజలకు అందించాల్సిన సేవలు, సమయపాలన గురించి హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు, వ్యాధినిరోధక టీకాలు అందించాలని ఆదేశించారు. అవసరమైన శస్త్రచికిత్సలు చేయకుండా సాధారణ ప్రసవాలు జరిగేటట్లు ప్రోత్సహించాలని సూచించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని కోరారు. సీజనల్కు అనుకూలంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, అంటువ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన చికిత్సలు అందించాలని కోరారు. కార్యక్రమాల్లో సీసీ నాగరాజు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ సాంబశివరావు