ఎంజీఎం : నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
సెర్ప్ ఏపీడీగా వెంకటేశ్వర్లు
హన్మకొండ అర్బన్ : హనుమకొండ డీఆర్డీఏ పరిధి సెర్ప్ అదనపు డైరెక్టర్గా బొజ్జ వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ సంస్థ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన చేపట్టిన సాధారణ బదిలీల్లో ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో వెంకటేశ్వర్లు జిల్లాలో డీపీఎంగా కొంతకాలం పనిచేశారు.
కేయూలో నేటినుంచి
జాతీయ వర్క్షాప్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీజువాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సమష్టి కృషితో
ఉత్తమ ఫలితాలు
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్
రామన్నపేట : విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను గురువారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశా ల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
అరుణాచలానికి
ఆర్టీసీ ప్రత్యేక బస్సు
హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలి పారు. వరంగల్–1 డిపో సూపర్ లగ్జరీ బస్(సర్వీస్ నంబర్ 92222) ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలుదేరి 28న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనం అనంతరం సాయంత్రం 7 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని ఒక ప్రకటనలో వివరించా రు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 29న మధ్యాహ్నం బయలుదేరి 30న ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, తర్వాత బీచుపల్లి హనుమాన్ దర్శనం అనంతరం హనుమకొండకు బయలుదేరుతుందన్నారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చ ని, పూర్తి సమాచారానికి 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఉత్సాహంగా 5కే రన్
ఉత్సాహంగా 5కే రన్