
జీజేసీలో సైన్స్గ్రూపులకు మోక్షం
ఆత్మకూరు: మండలకేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల 2009లో మంజూరైంది. అధునాతన పక్కాభవనంలోకి 2018లో మారింది. 2009 నుంచి 16 ఏళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ గ్రూపులకొరకు ఎదురు చూస్తున్నారు. సైన్స్ గ్రూపులు మంజూరు చేయాలని ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. మే 6న కూడా ‘కలగా మారిన సైన్స్ గ్రూపులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని గత నెల 30 వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రిన్సిపాల్ బి.ఎన్.రెడ్డి పలుమార్లు ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి, గత నెల 13న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కళాశాలలో సైన్స్ గ్రూపుల మంజూరుకు ఉత్తర్వులు ఇప్పించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ గ్రూపుల అవసరాన్ని గుర్తించి పలుమార్లు కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ని అభినందించారు.
అడ్మిషన్లు ప్రారంభం...
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా మంజూరైన సైన్స్ గ్రూపులు బైపీసీ, ఎంపీసీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సి పాల్ డి.రమాదేవి తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
16 ఏళ్ల కల నెరవేరింది
అడ్మిషన్లు ప్రారంభం

జీజేసీలో సైన్స్గ్రూపులకు మోక్షం