
భద్రకాళి ఆలయంలో చండీహోమం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉద యం అర్చకులు చండీహోమం నిర్వహించారు. అమెరికా దేశం డల్లాస్లో స్థిరపడిన రేవతి గత శనివారం 53 గ్రాములు, 57 గ్రాముల బరువు కలిగిన రెండు బంగారు కాసుల హారాలను కానుకగా భద్రకాళి అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా రేవతి దంపతులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి చండీహోమంలో పాల్గొన్నా రు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.
11 నుంచి బీపీఈడీ
నాలుగో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచా ర్య కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇవ్వడానికి రాకూడదని కోరారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవా రం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖా స్తులు స్వీకరిస్తామని, అవకాశాన్ని నగర ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్మిక శాఖ గుర్తింపు
కార్డుతో ప్రయోజనాలు
హన్మకొండ చౌరస్తా: కార్మికశాఖ గుర్తింపు కార్డుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.. ప్రతీ కార్మికులు తప్పనిసరిగా కార్డు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాజీపేటకు చెందిన 100 మందికి ఆయన లేబర్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేబర్ కార్డు ద్వారా కార్మికులకు భద్రత, వారి కుటుంబాలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతాయ ని, అర్హులందరికీ కార్డులు అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.

భద్రకాళి ఆలయంలో చండీహోమం