
రెండో రాజధానిగా
వరంగల్
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
నాగాభరణం బహూకరణ
సోమేశ్వర లక్ష్మీనృసింహస్వామికి ఓ భక్తుడు రూ.24లక్షల విలువైన మిశ్రమ బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు.
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా
ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
– IIలోu
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: చారిత్రక వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్ధికి రూ.4,962 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఖిలావరంగల్ మైదానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 2040 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చామన్నారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కానున్నట్లు తెలిపారు. విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు.. ఈ విమానాశ్రయం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలగనుందన్నారు.
ఓరుగల్లుకు ప్రత్యేక గుర్తింపు
వరంగల్ జిల్లాలో ఖరీఫ్లో లక్షా 22 వేల 340 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.62 కోట్ల బోనస్ చెల్లించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రబీ సీజన్లో జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 187 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్షా 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 47 వేల ఇళ్లను మంజూరు చేయగా.. వరంగల్ జిల్లాకు మంజూరైన 612 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలిపారు. వేడుకల్లో కలెక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విద్యార్థులను అభినందించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు అధికారులు ఆసక్తిగా తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రశంసపత్రాలు అందించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మెమొంటోలు అందించి శాలువాలతో సత్కరించారు.
అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న
మంత్రి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు
న్యూస్రీల్
యుద్ధప్రాతిపదికన పనులు..
నర్సంపేట మెడికల్ కాలేజీ, హాస్పిటల్, కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించినట్లు, వరంగల్ కొత్త బస్ స్టేషన్ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల వేగవంతం, రూ.80 కోట్ల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (కలెక్టరేట్), వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనుల్ని చిత్తశుద్ధితో అన్ని హంగులతో త్వరలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి 25,85,600 మొక్కలు నాటి 101 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. బ్యాంక్ లింకేజీ కింద 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రూ.475 కోట్ల రుణాలు మంజూరు చేసి రికవరీ చేసినందుకు వరంగల్ జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించినందుకు
అభినందనలు తెలిపారు.
గతంలో లేని విధంగా రూ.4,962 కోట్ల కేటాయింపు
2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్
మామునూరు విమానాశ్రయ
భూసేకరణకు రూ.205 కోట్లు
అవతరణ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
– మరిన్ని ఫొటోలు II, IIIలోu

రెండో రాజధానిగా

రెండో రాజధానిగా

రెండో రాజధానిగా

రెండో రాజధానిగా

రెండో రాజధానిగా