పరకాల మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పరకాల మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం

May 29 2025 1:29 AM | Updated on May 29 2025 1:29 AM

పరకాల మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం

పరకాల మాజీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం

హసన్‌పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్‌–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... పరకాల మాజీ కౌన్సిలర్‌ పల్లె దశరథం బుధవారం ఇంటినుంచి బైక్‌పై హనుమకొండకు బయలుదేరాడు. అప్పటికే దశరథం బైక్‌పై వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో వంగపహాడ్‌–ఆరెపల్లి మధ్యలో జాతీయ రహదారిపై మాటు వేశారు. దశరథం వంగపహాడ్‌ దాటిన తర్వాత ప్రత్యర్థులు అతని బైక్‌ను అడ్డుకుని పొత్తి కడుపుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడినుంచి దశరథం చాకచక్యంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం అతను వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.

పాత కక్షలే కారణం?

ఈ దాడికి పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మాజీ కౌన్సిలర్‌ దశరథానికి, పరకాలకు చెందిన ఓ వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం సదరు వ్యక్తిపై దశరథం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేయించినట్లు స్థానికులు తెలిపారు. ఆ కక్షలను దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు.

ఇనుపరాడ్లతో దాడి.. గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement