యువతకు హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

యువతకు హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి

May 30 2025 12:51 AM | Updated on May 30 2025 12:51 AM

యువతక

యువతకు హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి

ఎంజీఎం : యువతకు హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య అన్నారు. గురువారం నగరంలోని డబ్బాల జంక్షన్‌ వద్ద మొబైల్‌ వ్యాన్‌ హెచ్‌ఐవీ/ఎస్‌టీఐ సంపూర్ణ సురక్ష కేంద్రం సేవలపై ప్రదర్శన నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ హైరిస్క్‌లో ఉన్నవారికి అవగాహన కలిగించడంతోపాటు టెస్టింగ్‌ చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే కూడళ్లలో ఈ మొబైల్‌ వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం బ్రోచర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మదన్మోహన్‌రావు, పోచమ్మకుంట పీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ స్వప్న మాధురి, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, హెచ్‌ఈఓ శ్రీనివాస్‌, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్‌ పాషా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

గుర్తింపు లేని పాఠశాలలను

మూసివేయాలి : డీఈఓ

విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలను మూసివేసి సీజ్‌ చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్‌, నోట్‌బుక్స్‌, పెన్నులు తదితర వస్తువులను తమవద్దనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒ త్తిడి చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే శాఖాపర ంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌

అప్పిలేట్‌ అథారిటీ

సభ్యుడిగా దయాకర్‌

కేయూ క్యాంపస్‌: రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ అప్పీలేట్‌ అథారిటీ సభ్యుడిగా కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ గాదె దయాకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దయాకర్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎన్విరాన్‌మెంటల్‌ ఎక్సఫర్ట్‌ అప్రైజర్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో 15 ఏళ్లపాటు కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్‌ జోనల్‌ మెంబర్‌గా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడిగా పనిచేశారు. వరంగల్‌ ధర్మారానికి చెందిన దయాకర్‌ హనుమకొండలో స్థిరపడ్డారు. కేయూలో పలు పలు పదవులు నిర్వర్తించారు.

దరఖాస్తుల ఆహ్వానం

హసన్‌పర్తి : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బండారుపల్లి, వేలేరు, హసన్‌పర్తి, వంగర, నెక్కొండ, కొడకండ్ల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందుమతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్‌రెడ్డిలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్‌, సంస్కృతం, గణితం, ఫిజిక ల్‌ సైన్స్‌, బయోసైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లు, కళాశాలలో గణితం, బోటని, జువాలజీ, ఫిజిక్స్‌, కెమి స్ట్రి బోధించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా పాఠశాలలు, కళాశాలల్లో జూన్‌ 2వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. జూన్‌ 3వ తేదీన బాలికల గురుకుల జూనియర్‌ కళాశాల, పాఠశాలల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.

యువతకు హెచ్‌ఐవీపై  అవగాహన ఉండాలి1
1/1

యువతకు హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement