
శిక్షణ అంశాలు అమలుపర్చాలి
● డీఈఓ జ్ఞానేశ్వర్
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అమలుచేసేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్ హెచ్ఎంలకు వరంగల్లోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రారంభమైన ఐదురోజుల శిక్షణ శిబిరంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. క్వాలిటీ కోఆర్డినేటర్ సుజ న్తేజ, ఏసీజీ అరుణ, సెంటర్ ఇన్చార్జ్ లక్ష్మయ్య, శ్రీనివాస్, రవీందర్, మహేష్నాయక్ పాల్గొన్నారు.