విలువలతో కూడిన విద్య అవసరం | - | Sakshi
Sakshi News home page

విలువలతో కూడిన విద్య అవసరం

May 6 2025 12:33 AM | Updated on May 6 2025 12:33 AM

విలువ

విలువలతో కూడిన విద్య అవసరం

జిల్లా అకడమిక్‌

కోఆర్డినేటర్‌ సుజన్‌తేజ

వర్ధన్నపేట: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని జిల్లా అకడమిక్‌ కోఆర్డినేటర్‌ సుజన్‌తేజ అన్నారు. వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థులకు 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు 50 పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎంఈఓ శ్రీధర్‌ మాట్లాడుతూ శిబిరంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపా రు. పాఠశాల చైర్‌పర్సన్‌ లక్ష్మీబాయి, ఉపాధ్యాయులు పర్వత రమణారావు, ఎన్‌సీసీ అధికారి మనుజేందర్‌రెడ్డి, మైదం అశోక్‌, పల్లె మదన్‌మోహన్‌, బరిగెల దేవయ్య, లలిత్‌కుమార్‌, రోహిణీదేవి, సునీత, కుమారస్వామి, మంజుప్రియ, జయంజలి, అరవింద్‌, సుధారాణి, స్వర్ణకుమారి, రేఖ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య

పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నంబర్‌

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తితే కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 3424కు సమాచారం అందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాగునీరు రాకపోయినా, పైపులైన్‌ లీకేజీలు ఉన్నా, తాగునీటి ఇబ్బందులపై టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణమే సమస్య పరిష్కరిస్తారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

పెండింగ్‌ పనులు

పూర్తిచేయాలి

డీఆర్‌డీఎ ప్రాజెక్టు మేనేజర్లు

దయాకర్‌, అనిత

వర్ధన్నపేట: మహిళా సంఘాల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో వీఓఏలు కీలకమని డీఆర్‌డీఎ ప్రాజెక్టు మేనేజర్లు మునిగాల దయాకర్‌, అనిత అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్‌ కార్యాలయంలో సోమవారం గ్రామైక్య సంఘాల సహాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయకుండా ఉండడం వీఓఏల అలసత్వమేనన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్‌ పనులు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని, మహిళా సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో వీఓఎలకు జ్యూట్‌ బ్యాగులు పంపిణీ చేశారు. సమావేశంలో లింకేజీ డీపీఎం అనిత, ఏపీఎం ప్రేంరాజు, వేణు, యాంకర్‌ పర్సన్‌ రవికృష్ణ, సీసీలు గోలి కొమురయ్య, రమేశ్‌, స్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు అరుణ, ఎమ్మెస్‌ ఎ.రేవతి, వీఓఎలు కవిత, జ్యోతి, పద్మ, రమ, హైమ, అనిత, శోభ, స్రవంతి, ఇందిర, మంజుల తదితరులు పాల్గొన్నారు.

‘డీపీఎల్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ఎంజీఎం: డాక్టర్లు ‘బీ ఫిట్‌ టు ట్రీట్‌’ ఉద్దేశంతో వరంగల్‌ డాక్టర్స్‌ క్రికెట్‌ క్లబ్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈనెల 17 నుంచి 26 వరకు కాకతీయ మెడికల్‌ కాలేజీ మైదానంలో డాక్టర్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఐఎంఏ వరంగల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. పది రోజులు జరిగే ఈలీగ్‌లో 150 మంది డాక్టర్లు 8 బృందాలుగా ఏర్పడి 15 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే డాక్టర్లకు మానసిక ప్రశాంతతతో పాటు శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ లీగ్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, సెక్రటరీ అజిత్‌ మహ్మద్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ శిరీష్‌కుమార్‌, తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ పి.విజయచందర్‌రెడ్డి, డబ్ల్యూడీసీసీ సెక్రటరీ రాఘవేంద్ర ప్రదీప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసన్న, ఐఎంఏ నాయకులు సంధ్యారాణి, జనార్దన్‌, బందెల మోహన్‌రావు, రమేశ్‌ పాల్గొన్నారు.

విలువలతో కూడిన  విద్య అవసరం1
1/1

విలువలతో కూడిన విద్య అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement