
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి
● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం బేర్ ఫుట్ కౌన్సెలింగ్ థీంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్షాప్ను నిట్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధ్యాపకులు విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించేందుకు, ఉత్తమ విద్యను బోధించేందుకు, పరీక్షల్లో రాణించేందుకు రెండు రోజుల వర్క్షాప్ తోడ్పడుతుందని తెలిపారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఢిల్లీ ఎక్స్ప్రెషన్స్ ఇండియన్ నిపుణులు డాక్టర్ జితేంద్ర నాగపాల్, డాక్టర్ గీతా మెహ్రోత్రా, మాజీ డీజీపీ డాక్టర్ ఆదిత్య ఆర్య, డాక్టర్ అనంత మాధవమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడడం వంటి పిరికి చర్యలకు పాల్పడకుండా, ఓటమిని విజయంగా మలుచుకునేందుకు పాజిటివ్ మైండ్తో శ్రమించాలని సూచించారు.
నిట్తో హార్ట్ఫుల్ నెస్ సెంటర్ ఎంఓయూ...
నిట్ వరంగల్తో హైదరాబాద్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్ సోమవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది.