
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్(231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్(172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జా యింట్ సెక్రటరీగా ఆర్.శశిరేఖ(263 ఓట్లు), స్పో ర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓ ట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు.
హనుమకొండ అసోసియేషన్లో..
హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్లో మొత్తం 867 మంది ఓటర్లు ఉండగా 752 మంది పోలింగ్లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు కె.రమేష్బాబు, రవీందర్రావు తెలిపారు. అధ్యక్షుడిగా పి.సత్యనారాయణ(336 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా కె.రవి(294 ఓట్లు), ఉపాధ్యక్షడిగా సీహెచ్.రమేశ్(486 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రటరీగా సి.మల్లేష్(291 ఓట్లు), లైబ్రరీ జాయింట్ సెక్రటరీగా కె.వెంకటేశ్(406 ఓట్లు), కోశాధికారిగా సీహెచ్.సాంబశివరావు (484 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా బి.శివకుమార్యాదవ్(480 ఓట్లు), డి.సునిల్కుమార్(470 ఓట్లు), పి.కమలాకర్(449 ఓట్లు), సీహెచ్.నిఖిల్కుమార్(406 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు.
వరంగల్ అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులుగా
వి.సుధీర్, డి.రమాకాంత్
హనుమకొండ అధ్యక్ష ప్రధాన
కార్యదర్శులుగా
పి.సత్యనారాయణ, కె.రవి

ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు

ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు

ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు