
కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు
వరుణుడి రాకకు
ఎదురుచూపులు..
ప్రస్తుత వర్షాకాలంలో రుతు పవనాలు ముందస్తుగా వచ్చి మురిపించడంతో అధికారులు వన మహోత్సవానికి గుంతలు తవ్వి ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నర్సరీ నుంచి సుమారు ఐదు లక్షల వివిధ రకాల మొక్కలు కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా డీఆర్డీఓ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అటవీ ప్రాంతంలో నాటే మొక్కలు, ఇళ్ల ఆవరణల్లో నాటుకునేందుకు పండ్ల మొక్కలను జిల్లా లక్ష్యానికి సరిపడే విధంగా పెంచారు. కానీ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో మొక్కలు సిద్ధంగా ఉన్నా.. నాటేందుకు అవకాశం లేకుండా పోతోంది.
వనపర్తి: వన మహోత్సవం పేరిట అధికారులు ఏటా మొక్కలు నాటేటప్పుడు చూపుతున్న ఆసక్తి.. వాటి సంరక్షణలో లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పచ్చదనం పెంపొందించడంపై అధికార, పాలకవర్గానికి ఆసక్తి సన్నగిల్లుతోందనేందుకు నీరసించిన ఫలితాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వన మహోత్సవంలో భాగంగా గతేడాది జిల్లాలో 18.3 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. 14.3 లక్షల మొక్కలు మాత్రమే నాటడం కారణంగా చెప్పవచ్చు. ఏటా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అగ్రస్థానంలో లక్ష్యం నిర్దేశించుకొని మొక్కలు నాటుకున్నారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు కలుపుకొని 21.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఇటీవల అటవీశాఖ నిర్వహించిన వన మహోత్సవం తొలి కార్యక్రమంలో కేవలం 1,945 మొక్కలు నాటారు.
పెరగని అటవీ విస్తీర్ణం..
పదేళ్లుగా హరితహారం, వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షల్లో మొక్కలు నాటుతున్నా.. జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవి (పచ్చదనం) నిబంధన చేరుకునేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 5.41 లక్షల ఎకరాలు ఉండగా.. అటవీ విస్తీర్ణం కేవలం 27.50 వేల ఎకరాలు ఉంది. ఇంకా వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని పెంచాల్సి ఉంటుంది.
పచ్చదనం.. తగ్గుముఖం
ఏటా లక్షల్లో మొక్కలు నాటుతున్నా.. పచ్చదనం విస్తీర్ణం మాత్రం పెరగడం లేదు. రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి మొక్కలు నాటుతున్నా.. ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండిన మొక్కల స్థానంలో తిరిగి నాటేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పెరుగుతోంది.
జిల్లాకేంద్రంలో అటవీశాఖ నిర్వహించిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాయకులు (ఫైల్)
శాఖల వారీగా మొక్కల లక్ష్యం..
శాఖ 2024 2025
లక్ష్యం నాటింది లక్ష్యం నాటింది
గ్రామీణాభివృద్ధి 10,00,000 9,12,539 11,54,800 –
అటవీశాఖ 1,00,000 66,404 2,00,000 1,945
పంచాయతీరాజ్ 3,00,000 – 35,000 –
నీటిపారుదల 2,39,212 – 50,000 –
వ్యవసాయ 12,000 1,000 30,000 –
ఉద్యాన 15,000 26,975 50,000 –
ఎకై ్సజ్ 10,000 3,400 13,500 –
ఇతర శాఖలు 1,63,000 4,20,956 6,37,000 –
జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ., మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి జీవరాశులు, వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది.
●
కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది.
ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు..
కృష్ణానదిలో కాలుష్య కారకాలు కలుస్తున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. ఇది మా పరిధిలోని అంశం కాదు. కాలుష్య నివారణ బోర్డుకు సంబంధించిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్
పచ్చగా
మారుతున్నాయి..
కృష్ణానదిలో నీళ్లు మూడేళ్లుగా పచ్చగా మారుతున్నాయి. ఇవి పై నుంచి వస్తున్నాయి. వరద వచ్చినప్పుడు నీళ్లపై ఆకుపచ్చ రంగులో తెట్టెలు ఉంటున్నాయి. నీళ్లు తగ్గే సమయంలో అధికంగా కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా కొన్నిచోట్ల ఈ నీటి తెట్టెలు కనిపించాయి. ఈ విషయం ఇక్కడికి వచ్చే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– బాలరాజు,
మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం
మత్స్య సంపదకూ ముప్పే..
నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు.
కృష్ణానదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్క
న్యూస్రీల్
కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా..
గతేడాది 18.3 లక్షలకుగాను
నాటింది 14.3 లక్షలే..
పెరుగుతున్న మొక్కల్లో తగ్గుతున్న లెక్క
ఈ ఏడాది లక్ష్యం 21.7 లక్షలు
శుద్ధి చేసిన నీటినే..
మిషన్ భగీరథ స్కీంకు కృష్ణానది నుంచి ఎత్తిపోసే నీటినే వినియోగిస్తున్నాం. ఈ నీళ్లను రెగ్యులర్గా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. మట్టి, చెత్త ఏమున్నా ఫిల్టరింగ్లో వెళ్లిపోతుంది. ఆరోగ్యానికి హాని కలిగించని ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి. నీటి ఫిల్టరింగ్ను రెగ్యులర్గా పర్యవేక్షిస్తాం. నది నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే బాధ్యత మా శాఖ పరిధిలో లేదు. – అంజాద్పాష,
డీఈఈ, మిషన్ భగీరథ
పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి మారిన నది నీళ్లు
మూడేళ్లుగా అధికమవుతున్న
నీటి కాలుష్యం
వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు
దరిదాపుల్లో కానరాని కాలుష్య
నియంత్రణ మండలి అధికారులు

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’