సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం

May 29 2025 12:31 AM | Updated on May 29 2025 12:31 AM

సమస్య

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం

పాన్‌గల్‌: స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌ నాయకులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో మిగతా వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం వంటి పథకాలు అర్హులైన పేదలకే అందాలని కోరారు. స్థానిక సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్‌, సభ్యులు భాస్కర్‌, భగత్‌, ఎం.వెంకటయ్య, భీమయ్య, వెంకటయ్య, జంబులయ్య పాల్గొన్నారు.

4న ఉమ్మడి జిల్లా

బ్యాడ్మింటన్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ది మహబూబ్‌నగర్‌ డిస్ట్రిక్ట్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.శ్యాంసుందర్‌గౌడ్‌, ఎల్‌.రవికుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–13, అండర్‌–15, అండర్‌–17, అండర్‌–19, సీనియర్‌, వెటరన్‌ విభాగాల్లో సెలక్షన్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌ను రిపోర్టు చేయాలని, మిగ తా వివరాల కోసం 98480 85211, 98660 33377, 96189 75795, 98669 28835 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ, బీఎడ్‌ ఫలి తాలను బుధవారం పీయూ వీసీ శ్రీనివాస్‌ వి డుదల చేశారు. బీఫార్మసీ మొదటి సెమిస్టర్‌లో 5.52 శాతం, బీఎడ్‌ 3వ సెమిస్టర్‌లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.

రేపు సీతారాముల కల్యాణం

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు.

మొక్కలే మానవాళికి

జీవనాధారం

ఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్‌ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటేనే మొక్కలకు అవసరమైనప్పుడు నీటిని వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలియన్‌లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే రాబోయే కాలానికి ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ రాజేశం, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం 
1
1/2

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం 
2
2/2

సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement