
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ
పాన్గల్: చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. పరిమళ, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల వివరాల నమోదు రికార్డులు, వ్యాక్సిన్ నిల్వలు, అసంక్రమిత వ్యాధుల వివరాల నమోదు, వ్యాక్సిన్ పంపిణీ చేయని జాబితాను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించేలా, టీకాలు ఇప్పించడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు. పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ జిల్లా మేనేజర్ పరశురాం, జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ చంద్రయ్య, సీహెచ్ఓ రామయ్య, ఎంఎల్హెచ్పీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.