ప్రభుత్వ నిర్ణయం మేరకే.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయం మేరకే..

May 31 2025 12:17 AM | Updated on May 31 2025 12:17 AM

ప్రభుత్వ నిర్ణయం మేరకే..

ప్రభుత్వ నిర్ణయం మేరకే..

రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.

– తిరుపతి, ఏఈఓ, గుండుమాల్‌ క్లస్టర్‌

అన్ని వేదికలపై ఏర్పాటు..

ఉమ్మడి జిల్లాలో పైలెట్‌ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్‌ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.

– మనోహర్‌రెడ్డి, మేనేజర్‌, టీజీ రెడ్‌కో, ఉమ్మడి పాలమూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement