ధాన్యం కేటాయింపుపై టాస్క్‌ఫోర్స్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కేటాయింపుపై టాస్క్‌ఫోర్స్‌ విచారణ

Apr 30 2025 12:16 AM | Updated on May 2 2025 2:01 PM

‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

వనపర్తి: నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న రైస్‌మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారంటూ ఈ నెల 24న ‘సాక్షి’ దినపత్రికలో ‘అధికారుల లీలలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పందించి సోమ, మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఓ కార్యాలయం, పెబ్బేరులో పర్యటించారు. 

ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పెబ్బేరు మండలం తోమాలపల్లి శివారులో ఉన్న ఓ బాయిల్ట్‌ మిల్‌కు ధాన్యం కేటాయింపు, కేటాయించిన ధాన్యాన్ని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి శివారులో ఉన్న ఓ గోదాంలో నిల్వ చేయడంపై సమగ్ర విచారణ చేపట్టారు. డీఎస్‌ఓ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలని సిఫారస్‌ చేసిన మిల్లర్‌కు డీఎం పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్‌ ఏ అధికారంతో ధాన్యం కేటాయించేందుకు దస్త్రం సిద్ధం చేస్తారనే కోణంలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో అధికారి, మిల్లు యజమాని కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అఽధికారుల విచారణలో తేలినట్లు చర్చ జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement