ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం

Jun 2 2025 12:40 AM | Updated on Jun 2 2025 12:40 AM

ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం

ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం

వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని పుల్గర్‌చర్లలో రూ.2.94 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, కల్వరాలకు నూతనంగా ఏర్పాటు చేయనున్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రైతులు, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు రాజీవ్‌ యువ వికాసం, సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ తదితర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖరం, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ మల్లయ్య, నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ, నాయకులు రఘునాథ్‌రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్‌, నారాయణరెడ్డి, బిచ్చయ్యసాగర్‌, సుదర్శన్‌రెడ్డి, నరేష్‌, బాల్‌రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement