ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

Jun 2 2025 12:40 AM | Updated on Jun 2 2025 12:40 AM

ఆవిర్

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

వనపర్తి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో ముస్తాబు చేశారు.

కార్యక్రమాలు ఇలా..

● ఉదయం 9.50 గంటలకు ఎస్పీ రావుల గిరిధర్‌, 9.55కు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, 9.58కి ముఖ్యఅతిథి ప్రీతం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన వేదికకు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.

● 10 గంటలకు ముఖ్యఅతిథి జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ, రాష్ట్ర గీతాలాపన, పోలీసుల వందన సమర్పణ ఉంటుంది.

● 10.10 గంటలకు ముఖ్యఅతిథి జిల్లా ప్రగతిపై సందేశం. 10.30కి స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల సన్మానం ఉంటుంది.

● 10.35 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10.50కి వివిధ పథకాల లబ్ధిదారులకు ధ్రువపత్రాల పంపిణీ, 11 గంటలకు స్టాల్స్‌ సందర్శనతో కార్యక్రమం ముగియనుంది.

‘బొమ్మా, బొరుసుగా

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలన’

వనపర్తిటౌన్‌: బొమ్మా, బొరుసుగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలన కొనసాగుతోందని.. పార్టీలు వేరైనా చేసే అవినీతి ఒక్కటేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. ఆయా పార్టీల పాలనపై ప్రజలకు అవగాహన వచ్చిందని, ఏ పార్టీ వచ్చినా అవినీతి, అక్రమాలు ఆగవనే నిజాన్ని గ్రహించారని ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో పార్టీ జిల్లా మీడియా ఇన్‌చార్జ్‌ పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకం చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, 18 నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రైస్‌మిల్లర్లతో కుమ్మకై భారీగా అవినీతికి తెర లేపారని ఆరోపించారు. సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌సభ్యుడు మున్నూరు రవీందర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం కొరవడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు. వరి కొనుగోలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రధాని మోదీ 14 రకాల చిరుధాన్యాల మద్దతు ధర పెంచి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి రామన్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బాస్కెట్‌బాల్‌

క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌ బిన్‌ అహ్మద్‌, జాకీర్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాటాడారు. బుధ, గురువారం జిల్లాకేంద్రంలోని ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీలో వివిధ జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్‌ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను వారు అభినందించారు. సభ్యులు మీర్‌ ఖాలెద్‌అలీ, మహ్మద్‌ ఇలియాజ్‌, సుబాన్‌జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్‌ ముకర్రం, మహ్మద్‌ షకీల్‌, వినోద్‌కుమార్‌, బాలరాజు పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం1
1/2

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం2
2/2

ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement