● టిప్పర్ ఢీకొని జాతీయస్థాయి వెయిట్లిఫ్టర్ సత్యజ్యోతి మృతి
● కొండవెలగాడ వెళ్తుండగా ప్రమాదం
విజయనగరం క్రైమ్:
వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆమెకు ప్రాణం. చిన్నప్పటి నుంచి అక్క భారతితో కలిసి సత్యజ్యోతి(26)కఠోర సాధన చేస్తూ బరువులు ఎత్తడంలో పట్టుసాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 11 బంగారు పతకాలు సాధించింది. ఆ క్రమంలోనే నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకమే ప్రధానంగా తలపడేందుకు సిద్ధమైంది. ప్లస్ 86 కిలోల సీనియర్ కేటగిరీలో ఆదివారం జరగనున్న మ్యాచ్లో తలపడాల్సి ఉంది. ఇందులో భాగంగా పోటీలను తిలకించేందుకు అక్కతో కలిసి విజయనగరంలోని బాబామెట్టలోని ఇంటి నుంచి శనివారం రాత్రి బయలుదేరింది. వైఎస్సార్ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి, కానిస్టేబుల్ త్రినాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నా రు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి సత్యజ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆరిపోయిన ఆశా జ్యోతి


