
గంజాయి కేసుల్లో త్వరితగతిన అరెస్టులు
పార్వతీపురం రూరల్: విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా బుధవారం సమీక్షించి గంజాయి కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను త్వరితగతిన అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్టు, నేరాలు పునరావృతం చేసే వారి ఆస్తుల జప్తు, పెండింగ్ నాన్ బెయలబుల్ వారెంట్స్, డీ–అడిక్షన్ కార్యక్రమాలపై రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమగ్రంగా చర్చించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి