
మందుగుండు గోదాములపై దాడులు
విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని జెడ్పీలో జరిగిన అగ్నిప్రమాదంతో పోలీసులు అలెర్టయ్యారు. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అయినప్పటికీ వేసవికాలం దృష్ట్యా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా మందుగుండు గోదాములను తనిఖీ చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఆయా స్టేషన్హౌస్ ఆఫీసర్లు మందుగుండు గోదాములను చెక్చేశారు. లైసెన్స్డ్ గోదాములను చెక్చేసిన పోలీసులు మందుగుండు సామగ్రి నిల్వలు, భద్రతా ప్రమాణాలు,వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ అనధికారికంగా లైసెన్స్ లేని మందుగుండు గోదాములపై కేసులు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన ప్రమాణాలను గోదాములు నిర్వహిస్తున్న యజమానులకు వివరించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా గోదాములలో జరిగే తనిఖీలను బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పరిశీలించాలని ఎస్పీ ఆదేశించారు.
పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు