స్కూటీ అదుపుతప్పి ఇంజినీరింగ్‌ యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటీ అదుపుతప్పి ఇంజినీరింగ్‌ యువతి మృతి

Dec 25 2023 12:34 AM | Updated on Dec 25 2023 11:48 AM

- - Sakshi

సీతం కాలేజీలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న యువతి స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయి మృతిచెందింది.

విజయనగరం ఫోర్ట్‌: స్థానిక సీతం కాలేజీలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న యువతి స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయి మృతిచెందింది. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాజులరేగకు చెందిన బోనెల నందిని(18) శనివారం స్కూటీపై కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది.

దీంతో కుటుంబసభ్యులు నందినిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను తీసుకోవాలని రెడ్‌క్రాస్‌ సోసైటీ ఐ డోనేషన్‌ సెంటర్‌ సిబ్బందికి తెలియజేయడంతో టెక్నీషియన్‌ ఎ.శ్రీను కార్నియాలను సేకరించారు. తన కూతురు చనిపోయినా ఆమె కళ్లతో మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలన్న ఉద్దేశంతో ఆమె నేత్రాలను సేకరించాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ ఐ డొనేషన్‌ సెంటర్‌కు సమాచారం ఇచ్చామని మృతురాలి తండ్రి పైడిరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement