బాల భీముడు | - | Sakshi
Sakshi News home page

బాల భీముడు

Jan 1 2026 11:00 AM | Updated on Jan 1 2026 11:00 AM

బాల భీముడు

బాల భీముడు

అనకాపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ముత్యాలమ్మ కాలనీకి చెందిన కోసురు రూపవతి అనే మహిళ సాధారణ కాన్పులో బాలభీముడికి జన్మనిచ్చింది. 4.8 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రూపవతికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. కాన్పు కష్టంగా ఉందని భావించి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు జరిగింది. రూపవతికి 8వ నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో శిశువు బరువు 3 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్‌ తప్పదేమోనని అనుకున్నారు. వుడ్స్‌ కార్క్‌ స్క్రూ (మ్యాన్‌అవర్‌) విధానంలోని మెళుకువలను పాటించి, సహజ ప్రసవం చేయగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావు, వైద్యురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రిస్క్‌ ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement