‘కోడలు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కోడలు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి’

Sep 16 2025 8:38 AM | Updated on Sep 16 2025 8:38 AM

‘కోడలు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి’

‘కోడలు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి’

మహారాణిపేట: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బెల్జియంకు చెందిన ఓ కుటుంబం సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించింది. బెల్జియంలో పుట్టి పెరిగి, విశాఖలో స్థిరపడిన వరహామన్‌ లూసీన్‌, అతని భార్య ధనలక్ష్మి ఈ వినతిని సమర్పించారు. వారి కుమారుడు అశోక్‌ కుమార్‌, బిందురాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలం తరువాత బిందురాణి కుటుంబ సభ్యులు తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల పలాసలో బిందురాణి కుటుంబం తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పలాస వెళ్లడానికి భయపడుతున్నామని, ఈ కేసును విశాఖకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement