భారత అంధుల క్రికెట్‌ జట్టులో విశాఖ అమ్మాయి | - | Sakshi
Sakshi News home page

భారత అంధుల క్రికెట్‌ జట్టులో విశాఖ అమ్మాయి

Sep 12 2025 5:52 AM | Updated on Sep 12 2025 5:52 AM

భారత అంధుల క్రికెట్‌ జట్టులో విశాఖ అమ్మాయి

భారత అంధుల క్రికెట్‌ జట్టులో విశాఖ అమ్మాయి

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖపట్నానికి చెందిన పొంగి కరుణకుమారి భారత్‌లో తొలిసారిగా జరగనున్న మహిళల టీ–20 ప్రపంచ అంధుల క్రికెట్‌ కప్‌లో ఆడనుంది. నవంబర్‌ 11 నుంచి 25 వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అమెరికా దేశాలతో పాటు భారత్‌ కూడా పాల్గొంటోంది. టోర్నమెంట్‌ విజేతను నిర్ణయించడానికి లీగ్‌ దశలో 21 మ్యాచ్‌లు, ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత మహిళల అంధుల క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించిన కరుణకుమారి ప్రస్తుతం విశాఖలోని ప్రభుత్వ అంధుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement