మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు | - | Sakshi
Sakshi News home page

మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు

Sep 9 2025 6:47 AM | Updated on Sep 9 2025 6:47 AM

మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు

మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు

తాటిచెట్లపాలెం: సీతమ్మధారలో లైంగికదాడిక గురైన మైనర్‌ మూగ బాలిక కుటుంబ సభ్యులను సోమవారం జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరగడం వల్ల నేరాలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేకే రాజు భరోసా ఇచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌ రెడ్డి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రవీంద్ర భరత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement