అందుబాటులోకి డిజిటల్‌ న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి డిజిటల్‌ న్యాయ సేవలు

Sep 7 2025 7:06 AM | Updated on Sep 7 2025 7:06 AM

అందుబాటులోకి డిజిటల్‌ న్యాయ సేవలు

అందుబాటులోకి డిజిటల్‌ న్యాయ సేవలు

విశాఖలో ఈ–సేవ కేంద్రం ప్రారంభం

విశాఖ లీగల్‌: న్యాయ ఫలాలను అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ–సేవ కేంద్రాల లక్ష్యమని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రత్యేక ఈ–సేవ కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. న్యాయ సేవలను సత్వరమే కక్షిదారులకు అందించడమే ఈ కోర్టుల లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా దాపరికలేని సంపూర్ణ సమాచారాన్ని అందరూ పొందవచ్చని వివరించారు. న్యాయవ్యవస్థలో డిజిటల్‌ అంతరాన్ని తగ్గించి, న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ చల్ల గుణరాజన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement