‘గ్రీన్‌ రైల్వే స్టేషన్‌’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట్‌ | - | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌ రైల్వే స్టేషన్‌’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట్‌

Sep 7 2025 7:06 AM | Updated on Sep 7 2025 7:06 AM

‘గ్రీన్‌ రైల్వే స్టేషన్‌’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట

‘గ్రీన్‌ రైల్వే స్టేషన్‌’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట

తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్‌ మరో అరుదైన ఘనత సాధించింది. పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఈ స్టేషన్‌కు ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌ రైల్వే స్టేషన్‌ సర్టిఫికేషన్‌ (ప్లాటినం) లభించింది. గ్లోబల్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఈ సర్టిఫికెట్‌ను విశాఖ రైల్వే స్టేషన్‌కు అందజేయనుంది.విశాఖ రైల్వే స్టేషన్‌లో అమలు చేస్తున్న వివిధ పర్యావరణహిత పద్ధతులను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. ఇండియన్‌ రైల్వేస్‌లోని ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టరేట్‌, గ్లోబల్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ సహకారంతో ఈ రేటింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రేటింగ్‌లో భాగంగా ప్యాసింజర్‌ సౌకర్యాలు, నీటి వినియోగం, శాసీ్త్రయ పారిశుధ్య పద్ధతులు, విద్యుత్‌ ఆదా, హానికరమైన ఆయిల్స్‌ వినియోగం తగ్గించడం వంటి అంశాలను తనిఖీ చేసి, అంచనా వేశారు. ఈ సందర్భంగా వాల్తేర్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా మాట్లాడుతూ ఇది రైల్వే ఉద్యోగులందరి సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంట్‌ , హౌస్‌కీపింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది పనితీరు అద్భుతమని అభినందించారు. విశాఖ రైల్వే స్టేషన్‌ భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement