‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ

Aug 9 2025 8:42 AM | Updated on Aug 9 2025 8:42 AM

‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ

‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ

కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (తితిదే)లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ‘సౌభాగ్యం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కొమ్ములు, కుంకుమ, గాజులు, కంకణాలు అందజేశారు. ముందుగా, సౌభాగ్య కిట్‌లను శ్రీవారి ఆలయం చుట్టూ మంగళవాయిద్యాల నడుమ ప్రదర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్‌ వెంకటరమణ, హిందూ ధర్మ ప్రచార సిబ్బంది, జిల్లా ధార్మిక ప్రచార కమిటీ సభ్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement