కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’ | - | Sakshi
Sakshi News home page

కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’

May 31 2025 12:48 AM | Updated on May 31 2025 12:48 AM

కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’

కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’

విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు, కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించిన తీరును ఎండగడుతూ జూన్‌ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కేకే రాజు అధ్యక్షతన విశాఖ ఉత్తర నియోజకవర్గం సీనియర్‌ నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు చిన్నచూపు తప్ప, ఈ ప్రాంత అభివృద్ధి చేసేందుకు వారు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ విశాఖకు వచ్చిన ప్రాజెక్టులను అమరావతికి తరలించుకుపోతున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం పచ్చ మీడియాలో తప్ప మరెక్కడా కనబడట్లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని అమలు చేసేవరకు వైఎస్సార్‌సీపీ తరపున ప్రతీ కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, కార్పొరేటర్లు అల్లు శంకర్‌రావు, కె.అనిల్‌ కుమార్‌ రాజు, రెయ్యి వెంకటరమణ, భర్కత్‌ అలీ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణి కుమారి, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, పి.సునీత, నీలి రవి, దల్లి రామకృష్ణ రెడ్డి, సప్పంగి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేటి కిరణ్‌, గుడ్ల అశోక్‌ రెడ్డి, భీశెట్టి ప్రసాద్‌, కర్రి రామరెడ్డి, నూకరాజు, ప్రసాద్‌, సదరం జ్ఞానేశ్‌, షేఖ్‌ బాబ్జి, అశోక్‌ రెడ్డి, బి.శ్రీనివాస్‌, మువ్వల సంతోష్‌, రాఘవులు, పద్మ శేఖర్‌, నాగమణి, జగదీష్‌, సాయి, గాలి ప్రసాద్‌, కోట్యాడ సూర్య, గోవింద్‌, భోగవల్లి గోవింద్‌, సారిపల్లి సంతోష్‌, రత్నం, అప్పారావు, సొండి సురే ష్‌, జగదీశ్‌, చందనసాయి, ఈశ్వరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement