
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం జరగనుంది. మద్దిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు హాజరుకావాలని కేకేరాజు పిలుపునిచ్చారు.