భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి

Jun 1 2025 12:54 AM | Updated on Jun 1 2025 1:09 AM

భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి

భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి

విశాఖ సిటీ: మధురవాడలోని భూముల అభివృద్ధికి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆసక్తి చూపించినట్లు వీఎంఆర్‌డీఏ జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు. వీఎంఆర్‌డీఏకు చెందిన 87.80 ఎకరాల భూమిని పీపీపీ విధానంలో సంయుక్త అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను వివరించేందుకు శనివారం బెంగుళూరులో నైట్‌ ఫ్రాంక్‌ కార్యాలయంలో రోడ్‌ షో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సంస్థలైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఉషా శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌, స్థానిక రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు హాజరైనట్లు పేర్కొన్నారు. భూముల అభివృద్ధిపై సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రోడ్‌ షోలో వీఎంఆర్‌డీఏ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ శిల్ప, సీఈ భవానీశంకర్‌, నైట్‌ ఫ్రాంక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement